కలిసి ఉద్యమమని జెసి: బాలశౌరి గుడ్బై, రిజైన్లు వీరే...
పార్టీలకతీతంగా అందరు తమతో కలిసి వస్తారని తాము భావిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఇప్పటికే రాజీనామాలు చేశారన్నారు. విభజనపై కేంద్రం పునరాలోచన చేయాలన్నారు. తాము పదవులలో ఉంటూ ప్రజలకు సమాధానం చెప్పలేమన్నారు. తమవి ఆషామాషీ రాజీనామాలు కాదని స్పీకర్కు చెప్పామన్నారు.
రాష్ట్రపతి పాలన వచ్చినా పట్టించుకోం: గాదె
తాము సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రపతి పాలన వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించినట్లు చెప్పారు. అధిష్టానం సీమాంధ్ర ఆందోళనలను పట్టించుకోకుంటే నిర్ణయ ఫలితాలన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం సరికాదన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వల్లనే విభజనకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. విభజన దురదృష్టకరమన్నారు.
కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారు తమతమ రాజీనామాలను వివిధ రూపాలలో అందజేశారు. కొందరు స్పీకర్కు, కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, మరికొందరు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు, ఇంకొందరు ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపించారు. మరోవైపు మాజీ ఎంపి బాలశౌరి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
రాజీనామాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు
గంటా
శ్రీనివాస
రావు
కాసు
వెంకటకృష్ణా
రెడ్డి
వట్టి
వసంత్
కుమార్
మహీధర్
రెడ్డి
గాదె
వెంకట
రెడ్డి
కాటసాని
రాంభూపాల్
రెడ్డి
కాటసాని
రాంరెడ్డి
శిల్పా
మోహన్
రెడ్డి
వెంకట్రామయ్య
కారుమూరి
నాగేశ్వర
రావు
జెసి
దివాకర్
రెడ్డి
ఉగ్రనరసింహా
రెడ్డి
కాటసాని
రాంరెడ్డి
లబ్బి
వెంకటస్వామి
మల్లాది
విష్ణు
వెల్లంపల్లి
శ్రీనివాస్
ఆదినారాయణ
రెడ్డి
బంగారు
ఉషారాణి
దగ్గుపాటి
వెంకటేశ్వర
రావు
కమలమ్మ
ఆనం
వివేకానంద
రెడ్డి
కేతిరెడ్డి
వెంకట్రామి
రెడ్డి
రామాంజనేయులు
కొత్తపల్లి
సుబ్బారాయుడు
కన్న
బాబు
వంగ
గీత
పంతం
గాంధీమోహన్
రమణమూర్తి
రాజు
నల్లిమిల్లి
శేషా
రెడ్డి
ఎమ్మెల్సీలు
మహ్మద్
జానీ
పాలడుగు
వెంకట్రావు
రుద్రరాజు
పద్మరాజు
గాదె
శ్రీనివాసులు
సుధాకర్
బాబు
తిప్పేస్వామి