వెనక్కి వెళ్లం: టిపై గవర్నర్ను కల్సిన మంత్రుల భార్యలు

విభజన జరిగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని సాకె మోక్ష అన్నారు. తమ ప్రాంతంలో విద్యాసంస్థలు, కంపెనీలు లేవన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన జరిగిందన్నారు. ఎవరిని అడిగి రాష్ట్రాన్ని విభజించారని ప్రశ్నించారు. తమ పిల్లలు ఎక్కడ చదవాలని, ఎక్కడ ఉద్యోగాలు సంపాదించాలని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల బాధ చెప్పాలనే తాము గవర్నర్ను కలిశామన్నారు.
ఈ రాష్ట్ర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. విభజన జరిగితే తాము మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెనక్కి వెళ్లేందుకు సిద్దంగా లేమన్నారు. విభజన వద్దని తాము గవర్నర్ను కోరామని సామినేని విమల చెప్పారు.
ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని దెబ్బతీయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప సతీమణి రాణి అన్నారు. విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణ ప్యాకేజీ వస్తుందని తమకు ఏమాత్రం నమ్మకం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications