వెనక్కి పోదు, ముందుకు సాగకపోవచ్చు: టీపై చిరు

హైదరాబాదులాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి తరాలు పడుతుందని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే సమన్యాయం జరుగుతుందని భావిస్తే ఆలాగే చేస్తారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. జల, ఉద్యోగ విషయాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని, ప్రజలతో ఉంటానని ఆయన అన్నారు.
కాంగ్రెసు అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళను బాధ్యతగా తీసుకుని ఈ తీవ్రతను తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. వాస్తవ పరిస్థితులను వివరించినట్లు తెలిపారు విభజన నిర్ణయానికి సీమాంధ్ర ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని, కోపోద్రిక్తులయ్యారని, తన దిష్టిబొమ్మను తగులబెట్టినా తాను తీవ్రంగా తీసుకోబోనని, అలా తగులబెట్టడం షాక్ అబ్జార్వర్గా పనిచేస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. త్వరలో సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. సినిమాలను, రాజకీయాలను తాను కలిపి చూడబోనని ఆయన చెప్పారు. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతనే విభజనకు తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగకపోవచ్చునని ఆయన అన్నారు. సోనియాతో చిరంజీవి భేటీలో అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications