లోకేష్పై జగన్ పార్టీ: ప్రశ్నపత్రాల దొంగని టిడిపి కౌంటర్

జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు చిన్నప్పుడే హిమయత్ నగర్లో పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ చేసి అమ్ముకునే వారని ఆరోపించారు. 1986-87లో వీళ్లిద్దరు కలిసి మేడ్చల్లోని ఓ పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాలు దొంగిలించేందుకు కారులో వెళ్లి పోలీసులకు దొరికిపోలేదా అని ప్రశ్నించారు.
పోలీసులు విచారణ జరిపితే ఆ కారు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కేసు మేడ్చల్ కోర్టులో నాలుగైదేళ్ల క్రితం వరకు విచారణ జరిగిందని, జగన్, శ్రీకాంత్ రెడ్డిల కారణంగా నాడు పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు కేసులు ఎదుర్కొని, తర్వాత ఏ ఉద్యోగం రాక తీవ్రంగా ఇబ్బందులు పడడం వాస్తవం కాదా అన్నారు.
సిబిఐ వేసిన ఎనిమిది ఛార్జీషీట్లలో జగన్ మొదటి ముద్దాయిగా ఉన్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, నారా లోకేష్ పైన శ్రీకాంత్ రెడ్డి నిన్న విమర్శలు చేయగా, నర్సిరెడ్డి పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications