డేటా లీకేజీకి అవకాశమే లేదు .. ఏపీ ఐటీశాఖ కార్యదర్శి స్పష్టీకరణ
అమరావతి : ఐటీ గ్రిడ్ డాటా ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. ఏపీకి సంబంధించిన డాటాపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే డేటా లీకేజీ జరుగలేదని ఏపీ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్పష్టంచేశారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆధార్ డేటా చోరికి గురయ్యే ఆస్కారం లేదని స్పష్టంచేశారాయన.

భద్రంగా డేటా
కంప్యూటకరీంచిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. ప్రతిసారి ప్రజాసాధికార సర్వే జరుగుతుందని .. ఇందులో కొత్తేం లేదన్నారు. సర్వే ద్వారా తీసుకున్న డాటా మొత్తం సేఫ్, అండ్ సెక్యూర్ గా ఉందని స్పష్టంచేశారు. ఏపీ ప్రజలకు సంబంధించి ప్రభుత్వ శాఖ అడిగితే ఇస్తామని పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు మాత్రమే వెబ్ సర్వీస్ ద్వారా యాక్సిస్ చేసి .. లబ్ధిదారులకు సేవలు అందిస్తాయని తెలిపారు.

నిరాధార ఆరోపణలు చేయొద్దు
ప్రజాసాధికార సర్వే డేలా లీక్ అయిందనే వార్తలను తోసిపుచ్చారాయన. అలాంటి సమస్యే ఉత్పన్నం కాదన్నారు. ఈ డేటా బేస్ ఆధారంగానే 26 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 4 లక్షలకు పైగా నిరుద్యోగులకు భృతి, తిత్లీ బాధిత రైతులకు నష్టపరిహారం, 95 లక్షలకుపైగా మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ చేశామని గుర్తుచేశారు. 54 లక్షలమందికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేశామని .. పూర్తిస్థాయి భద్రతతో కూడిన డేటా బేస్ కావడం వల్లే .. ఇంత భారీగా లబ్ధిదారులకు సేవలు అందించామని పేర్కొన్నారు.

1100 డేటా కూడా సేఫ్
ప్రజాసాధికార డేటాతో పాటు ఫిర్యాదు చేసే 1100 సమాచారం కూడా సేఫ్ అని తేల్చిచెప్పారు. ఈ సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ శాఖలు అడిగిన ఆ సమాచారం ఇవ్వడం లేదని .. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని సూచించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications