Pawan Kalyan: పవన్ కు పరిటాల గుండు కొట్టించారా - క్లారిటీ ఇచ్చిన శ్రీరాం..!!
Pawan Kalyan- Paritala: పవన్ కల్యాన్ కు పరిటాల గుండు కొట్టించారనేది చాలా కాలం క్రితం జరిగిన ప్రచారం. ఇప్పుడు మరోసారి ఆ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని పైన పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాం క్లారిటీ ఇచ్చారు. ఒక భూ వివాదంలో పవన్ కు పరిటాల గుండు కొట్టించారంటూ చాలా ఏళ్ల క్రితం ఏపీలో న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో అసలు నిజం ఉందా లేదా అనేది ఎవరూ నిర్దారించలేదు. దీని పైన ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పరిటాల శ్రీరాం స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్ - పరిటాల కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో వివరించారు.
పవన్ కల్యాణ్ పైన పరిటాల శ్రీరాం ఆసక్తి కరం అంశాలను వెల్లడించారు. పవన్ కు సమాజం పట్ల బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎవరైనా నాయకుడిగా ఎదిగే సమయంలో ఇటువంటి రూమర్లు ప్రచారంలోకి రావటం సహజమైనవిగా తేల్చేసారు. వస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే, అసలు నిజం లేకపోతే ఏరకంగా స్పందిస్తామని శ్రీరామ్ ప్రశ్నించారు. పవన్ ఇమేజ్ ను తగ్గించటానికి ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారని శ్రీరాం చెప్పుకొచ్చారు. పవన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎవరు ఎన్ని రూమర్లు ప్రచారం చేసినా పవన్ అర్దం చేసుకోగలరని శ్రీరాం వ్యాఖ్యానించారు. పవన్ ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం మినహా.. పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి అర్దం లేని ప్రచారాలకు ఇప్పటికైనా ముగింపు పలకాని శ్రీరాం సూచించారు.

అప్పట్లో ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రచారం ఇప్పుడు శ్రీరాం ఇంటర్వ్యూలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం ఇచ్చిన క్లారిటీతో ఇక దీనికి ముగింపు లభించినట్లయింది. ప్రస్తుతం టీడీపీ - జనసేన మధ్య పొత్తు వ్యవహారం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు అందరం కలిసి పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, పరిటాల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో రాప్తాడు కీలకం కానుంది. ఈ సారి గెలుపు పైన పరిటాల శ్రీరాం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అదే సమయంలో తాను మరోసారి గెలవటం ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. కొద్ది రోజులుగా పరిటాల వర్సస్ తోపుదుర్తి మధ్య రాజకీయం హోరా హోరీగా సాగుతోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications