Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు - అధికారుల కీలక సూచనలు..!!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రానికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ నంబర్‌ ప్రింట్‌ చేశారు.

సర్వం సిద్దం
రేపు (మార్చి 18) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్య పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు చూపితే ఆర్టీసీ బస్సులో టెన్త్‌ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.

10th class exams begins on 18 th March in Telugu states Officials key instructions

ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. 0866-2974540 నంబర్ తో ఈ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడు, రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 35,119 మంది ఇన్విజలేటర్లు, 3473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. పరీక్షల అనంతరం ఈ నెల 31 నుంచే టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు. తెలంగాణలోనూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.

కీలక సూచనలు
పరీక్షా కేంద్రాలకు ప్రారంభమవుతుంది. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసి 5 నిమిషాల గ్రేస్‌ టైం ఇచ్చినట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. దీంతో 9.35 నిమిషాల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. వేసవి కాలం..ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ పరీక్షా కేంద్రాల్లో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్దమైనట్లు అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+