స్వాతి హత్యకేసు: నిందితుడు సహ ఉద్యోగే, కారణం అదే...!
అమరావతి: విజయనగరం జిల్లలో సంచలనం సృష్టించిన ఎస్.కోట్ రైల్వే ఉద్యోగిని హత్యే కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. పోలీసులకే పెను సవాల్గా మారిన ఈ కేసుని చేధించడానికి నెలరోజులు పట్టింది. మే 11న శృంగవరపుకోట మండలంలోని రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అదే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యకు ప్రధాన కారణం గోపాలపట్నంలో పని చేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమేనని పోలీసులు తెలిపారు. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు.
అందుకు స్వాతి అంగీకరించకపోవడంతో ఆమెను చంపేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. గతంలో రైల్వే పోర్టర్గా పనిచేసిన గోపీకి ఇటీవల పదొన్నతి లభించింది. ఈ కేసులో సుమారు పన్నెండు వందల మంది వరకు అనుమానుతుల్ని విచారించారు. ఈ క్రమంలో స్వాతి హత్యకేసులో సహ ఉద్యోగే సూత్రధారి అన్న విషయం విచారణలో వెల్లడైంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications