స్వాతి హత్యకేసు: నిందితుడు సహ ఉద్యోగే, కారణం అదే...!
అమరావతి: విజయనగరం జిల్లలో సంచలనం సృష్టించిన ఎస్.కోట్ రైల్వే ఉద్యోగిని హత్యే కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. పోలీసులకే పెను సవాల్గా మారిన ఈ కేసుని చేధించడానికి నెలరోజులు పట్టింది. మే 11న శృంగవరపుకోట మండలంలోని రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అదే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యకు ప్రధాన కారణం గోపాలపట్నంలో పని చేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమేనని పోలీసులు తెలిపారు. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు.
అందుకు స్వాతి అంగీకరించకపోవడంతో ఆమెను చంపేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. గతంలో రైల్వే పోర్టర్గా పనిచేసిన గోపీకి ఇటీవల పదొన్నతి లభించింది. ఈ కేసులో సుమారు పన్నెండు వందల మంది వరకు అనుమానుతుల్ని విచారించారు. ఈ క్రమంలో స్వాతి హత్యకేసులో సహ ఉద్యోగే సూత్రధారి అన్న విషయం విచారణలో వెల్లడైంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications