ఆంధ్రప్రదేశ్ లో 9,265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ...స్కూళ్ల మూసివేతపై వివరణ అడిగిన సుప్రీంకోర్టు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 9, 265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అశోక్గుప్తా త్రిసభ్య కమిటీ లెక్కలు తేల్చింది. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది.
ఒకసారి 4600 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్న ఎపి ప్రభుత్వం మరోసారి పోస్టుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువ ఉన్నారని కోర్టుకి తెలపడంతో కోర్టు పోస్టుల లెక్క తేల్చేందుకు కమిటీని నియమించింది. అశోక్గుప్తా నేతృత్వంలోని ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరిపి రాష్ట్రంలో మొత్తం 9, 265 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చింది.

అంతేకాకుండా ఎపిలో గత సంవత్సరం 1167 స్కూళ్లు మూసేసారని కూడా త్రిసభ్య కమిటీ కోర్టుకు తెలపింది. దీంతో సూళ్ల మూసివేత అంశాన్ని సీరియస్ గా పరిగణించిన సుప్రీంకోర్టు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే విద్యాసంవత్సరంలోగా భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications