విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాబోయే భర్తతో సరదాగా షికార్లు.. కళ్లకు గంతలు కట్టి గొంతుకోసేసింది: ఆస్పత్రిలో చేర్చి వధువు పరార్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే నిశ్చితార్థం అయిన ఓ జంట సరదాగా చక్కర్లు కొట్టారు. షాపింగ్‌కు వెళ్లారు. అయితే, కాబోయే భర్తకు కళ్లకు గంతలు కట్టిన యువతి.. అతడి గొంతుకోసింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కాబోయే భర్తతో కలిసి యువతి షికార్లు

కాబోయే భర్తతో కలిసి యువతి షికార్లు

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల ఘాట్ రోడ్‌కు చెందిన 28 సంవత్సరాల యువకుడు అద్దేపల్లి రామునాయుడుకు, రావికమతం గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతికి నిశ్చితార్థమైంది. మే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ బైక్‌పై షాపింగ్‌కు వెళ్లారు. కొమళ్లపూడిలో షాపింగ్ అనంతరం.. పక్కనే ఉన్న బాబాఅశ్రమం వద్దకు వెళ్లారు.

కాబోయే భర్త కళ్లకు గంతలు కట్టి గొంతుకోసేసింది..

కాబోయే భర్త కళ్లకు గంతలు కట్టి గొంతుకోసేసింది..

ఆ తర్వాత బాబాఆశ్రమం వద్ద కళ్ల గంతలు ఆడుదామని వధువు చెప్పడంతో.. రామునాయుడు సరే అన్నాడు. అతని కళ్లకు గంతలు కట్టిన యువతి.. ఆ తర్వాత కత్తితో అతని గొంతు కోసింది. ఆ తర్వాత ద్విచక్రవాహనంపై సమీపంలోని రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, గొంతుకు ఏదో గుచ్చుకుని గాయమైందని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పి, అక్కడి నుంచి పరారైంది నిందితురాలు.

పెళ్లి ఇష్టం లేకనే వధువు దారుణం..

పెళ్లి ఇష్టం లేకనే వధువు దారుణం..

విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అనంతరం యువకుడిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, సదరు యువతి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. బాధిత యువకుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. పీహెచ్‌డీ చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారనే కోపంతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది.

ల్యాప్‌ట్యాప్ పేలి.. యువతికి తీవ్రగాయాలు

ల్యాప్‌ట్యాప్ పేలి.. యువతికి తీవ్రగాయాలు

వైయస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో ల్యాప్‌ట్యాప్ పేలింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుమతి తన ల్యాప్‌ట్యాప్ కి ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా.. ఉన్నట్టుండి అది పేలింది. దీంతో మంటలు వచ్చాయి. ఈ ఘటనలో సుమతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మొబైల్ ఫోన్లు చూశాం కానీ.. ల్యాప్‌ట్యాప్ పేలడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

English summary
A bride attacked with a knife on bride groom in anakapalle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X