ఏపీ సరిహద్దుల్లో భారీ నగదు పట్టివేత ... ఎంతో తెలుసా
ఎన్నికల కాలం వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు అన్న అంచనాలను సైతం వేశారు ఎన్నికల అధికారులు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరుగుతుందని ముందే గుర్తించారు .
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుంటే తెలుగురాష్ట్రాల్లో సైతం రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు , అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపధ్యంలో నగదు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా అప్రమత్తమైన అధికారులు హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేశారు. రూ.1.53కోట్ల డబ్బును ట్రక్కులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు.
తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూడి చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో రెండు సూట్ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన నీరజ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications