వోల్వో బస్సు ప్రమాదం: రసాయనాల వల్లే మంటలు?

ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ డైరెక్టర్ షకీల్, డ్రైవర్ ఫిరోజ్పాషలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ముఖ్యంగా బస్సులో ఆరు క్యాన్లలో ప్రమాదకర రసాయన పదార్థాలను కూడా తరలిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. అదేవిధంగా ఆరు విగ్గులు (తల వెంట్రుకలు) కూడా ఉన్నట్లు గుర్తించారు. అగ్నికి మరింత ఆజ్యంపోసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బస్సులో ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో బస్సు దగ్ధం కావడం, అందులో 45 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం బట్టి చూస్తే బస్సులో రసాయన పదార్థాలు ఉన్నందువల్లే బస్సుకు మంటలు త్వరగా వ్యాపించి ఉంటాయని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
డివైడర్ను ఢీకొని వోల్వో బస్సు డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడం జరిగినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధం కావడం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడం రసాయన పదార్థాలే ముఖ్య కారణమని పరిశీలన బృందాలు భావిస్తున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదానికి గురైంది నిజమని కూడా తేల్చేశారు. అయితే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి, ఏకంగా 45 మంది సజీవదహనం కావడానికి బస్సులోని ప్రమాదకర రసాయన పదార్థాలు కారణమని అంటున్నారు.
19 మృతదేహాల గుర్తింపు
ప్రమాదంలో మరణించిన 45 మందిలో ఇప్పటివరకు 22 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే ముగ్గురి మృతదేహాలను గుర్తించగా, సోమవారం మరో 19 మృతదేహాలను గుర్తించినట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. హైదరాబాద్లో డిఎన్ఎ పరీక్షలు నిర్వహించిన అనంతరం 19 మృతదేహాలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.
మృతదేహాలను సోమవారం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను కూడా గుర్తించే ప్రక్రియ చురుకుగా కొనసాగుతుందని, వాటిని ఒకటి, రెండు రోజుల్లో బంధువులకు అప్పగిస్తామని అన్నారు. గుర్తించిన మృతదేహాలలో ప్రశాంత్గుప్త, శివకిరణ్, వేదావతి, రవి, ఎండి సర్ధార్, అశుతోష్ పాండా, అక్షయ్సింగ్, ఎం. ఫణికుమార్, ఎన్ఎస్ గిరిధర్, జి.బాలసుందర్రాజ్, జి.మర్రి విజయకుమారి, జ్యోతి రంజాన్సాహు, సయ్యద్ మహ్మద్ జమాలోద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోసిన్పాష, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ ఆహ్మద్ ఉన్నాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications