షర్మిల మౌనమెందుకు?: గీతాంజలి మరణంపై పూనమ్ కౌర్ తీవ్ర స్పందన
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెనాలి వివాహిత గీతాంజలి మరణంపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ ఘటనపై స్పందించలేదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. సాటి మహిళలు, పిల్లల పట్ల దయాగుణంలో ఉండడమే స్త్రీ నాయకత్వానికి ప్రధాన లక్షణమని పూనమ్ కౌర్ అన్నారు.
గీతాంజలి మృతి ఘటనపై మహిళా నేతగా కొనసాగుతున్న వైఎస్ షర్మిల స్పందించకపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని పూనమ్ కౌర్ అసహనం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

గీతాంజలి మరణానికి కారణమైనవారిని గుర్తించి శిక్షించాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది ఎవరనేది తనకు అయోమయంగా మారిందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఒక పార్టీకి చెందిన ట్రోలర్లా, లేక కనిపించకుండా పోయిన వాలంటీరా? అనేది తనకు అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు.
The very first and foremost character of feminine leadership is compassion for other women and children , silence on the current issue of #geetanjali by #YSSharmila surprises me to great extent , it’s the common women and girls of #tenali who need to come out and teach a lesson .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 13, 2024
నిందితులను గుర్తించి శిక్షించాలని, గీతాంజలి పిల్లలకు న్యాయం చేయాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. కాగా, గీతాంజలి మరణానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ట్రోలింగ్ కారణమంటూ అధికార వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని టీడీపీ, జనసేన పార్టీల నేతలు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications