అమరావతిలో పాదయాత్ర - బహిరంగ సభ, ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!!

అమరావతి ప్రాంతంలో మరోసారి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరావతి పరిధిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో ప్రభుత్వం విధ్వసంనానికి కుట్ర చేస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఈ నెల 24న ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అటు జిల్లా అధికారులు ఆర్ -5 జోన్ లో 1134.58 ఎకరాలను నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రెండు జిల్లాల వారికి కేటాయించారు.

నిరసన షెడ్యూల్ ప్రకటన: అమరావతి పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ను రైతు జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాలైన మంగళగిరి మండలం క్రిష్ణాయపాలెంతో మొదలై మందడం, ఐనవోలు, కురగట్లు మీదుగా నిడమర్రు వరకు నిరసనగా ప్రజా చైతన్య పాదయాత్రకు నిర్ణయించింది. 24వ తేదీన ఈ యాత్ర నిర్వహణకు నిర్ణయించారు.

Amaravati Farmers

సాయంత్రం నిడమర్రుతలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో విన్నపాలను ఇవ్వటంతో పాటుగా నిరసన కార్యక్రమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. మే 2న ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టరేట్లతో విన్నపాలనిస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించ క పోతే ఉద్యమం తీవ్రం చేయాలని కమిటీ నిర్ణయించింది.

ప్రభుత్వ కుట్ర చేస్తోందంటూ: అమరావతి రైతు జేఏసీ నేతలు వెలగపూడిలో సమావేశమయ్యారు. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయస్థానంలో విచారణలో ఉండగానే ఆర్ -5 జోన్ ఏర్పాటు పెద్ద కుట్రగా జేఏసీ నేతలు ఆరోపించారు. సెంటుభూమి పేరుతో ప్రభు్వం అమరావతి విధ్వంసానికి తెర తీసిందని ధ్వజమెత్తారు.

ఆర్ -3 జోన్ లో రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వగా అయిదు వేల ఎకరాలు మిగులు భూమి ఉందని, అక్కడ కాకుండా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూమిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించటం ఏంటని ప్రశ్నించారు. ఆర్ -3 జోన్ నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వలనేదని నిలదీసారు. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో పరువు దక్కించుకొనే రాజకీయ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.

సిద్దమైన ఇళ్ల పట్టాలు: రాజధాని ప్రాంతంలో స్థానికేతరులక ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియను గుంటూరు జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. లబ్దిదారుల ఎంపిక, పరిశఈలన, పట్టాల ముద్రణ చేస్తోంది. ఆర్ -5 జోన్లో నవరత్నాలు, పేదలకు ఇళ్లు కార్యక్రమం కింద మొత్తం 1134.58 ఎకాలను గుంటూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లోని వారికి కేటాయించారు. లబ్దిదారులకు ఒక్కొక్కరికి సెంటు భూమి కేటాయించనున్నారు.

మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటుగా పెదకాకాని, తుళ్లూరు మండలాల పరిధిలో 19,854 మంది లబ్దిదారులను గుర్తించారు. వీటికి పట్టాలు నమోదు చేసి ప్రింట్ ఇస్తున్నారు. అటు ఆర్ -5 జోన్ పరిధిలో స్థానికేతురలకు స్థలాలు ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో, రేపు (సోమవారం) చోటు చేసుకొనే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+