జగన్కు పండ్లు, మిఠాయిలు తీసుకువెళ్లిన అమరావతి రైతులు
అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు పూలబొకేలు, పండ్లు, మిఠాయిలు తీసుకొని తాడేపల్లిలో నివాసం ఉండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వచ్చారు. వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతివ్వాలంటూ అక్కడ రక్షణగా ఉన్న పోలీసులను కోరగా వారు నిరాకరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల సమయంలో తమను కలవడానికి ఆయన ప్రయత్నించలేదని, తామే ఆయన్ను కలవాలని ఎన్నోసార్లు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే నిరాకరించారని రైతులు వెల్లడించారు.
ఎందుకు అడ్డుకుంటున్నారు?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాలమీదుగానే సచివాలయానికి వెళుతూ పరదాలు కట్టుకున్నారని, కలుద్దామంటే పోలీసులు నెట్టేశారని రైతులు వాపోయారు. ఇప్పుడైన ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వలంటూ పోలీసులకు విన్నవించుకున్నారు. మీరు హేళన చేయడానికి వచ్చారా? అంటూ పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను కలిసేందుకు అవకాశమే లేదని తేల్చిచెప్పారు. దానికి రైతులు బదులిస్తూ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుకదా.. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు.. ఎమ్మెల్యే అని, ఆయన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.

రెండురోజులున్న తర్వాత..
ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సీఐ సూచించారు. అలా సూచిస్తూనే మహిళా పోలీసులతో రైతులను నెట్టించేందుకు ప్రయత్నించారు. ఎంత అడిగినా జగన్ ను కలవడానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో అన్నదాతలు తాము తీసుకువచ్చిన పండ్లు, మిఠాయిలు అక్కడున్నవారందరికీ పంచిపెట్టారు.
👉పులివెందుల పులి బిడ్డకు పూలు, పుష్పాలు .
— Srini Manne #PrajaGalam (@mannesrini) June 6, 2024
👉అన్నకు అభినందనలు అమరావతి రైతులు
👉జగన్ ఇంటి వద్దకు అమరావతి రైతులు.
👉కూటమిని గెలిపించిన జగన్ అన్నకు వందనాలు .
👉తాడేపల్లిలో జగన్ ను కలవడానికి వెళ్లడానికి ప్రయత్నించిన అమరావతి రైతులు.
👉ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రైతులకు… pic.twitter.com/hrwE5kSZpC
రెండురోజులు గడిచిన తర్వాత జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసులు చెప్పడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందని ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి మూడు రాజధానులన్నారు. దీనిపై నాలుగున్నర సంవత్సరాల సమయం రైతులు దీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications