Amaravati: అమరావతి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతులకు ఈ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తున్నారు. కాగా.. ఇప్పుడు వీధిపోట్లు ఉన్న ప్లాట్ల సమస్యకు పరిష్కారం చూపించేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక.. రిజిస్ట్రేషన్.. మ్యూటేషన్ పైన ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించింది.
అమరావతి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లకు వీధి పోట్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పై నియమించిన త్రిసభ్య కమిటి ఇచ్చిన సూచన మేరకు రైతులకు వేరే ప్రాంతాల్లో ప్లాట్ల కేటాయింపు కోసం అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీధి పోట్లు ఉన్న ప్లాట్లలో మార్పుల ద్వారా తమకు అన్యాయం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయని, మ్యూటేషన్ కాని 112 ప్లాట్లను అధికారులు గుర్తించారు. దీంతో, ఇప్పుడు వారి సమస్యకు పరిష్కారం చూపుతూ కొత్త నిర్ణయాలు అమల్లోకి తెచ్చింది. ఆ ప్లాట్లకు బదులు వేరే చోట వాస్తు ప్రకారం ప్లాట్లు కేటాయించనున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. ఉండవల్లి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు 21 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు.

రైతుల సమస్యలకు పరిష్కారం
కాగా, రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం గ్రామసభలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెంలో గ్రామసభలు జరుగుతున్నాయి.రాజధాని నిర్మాణానికై భూములు అందజేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన 195 మంది రైతులకు సీఆర్డీఏ అధికారులు 381 నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రయల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి రుసుము వసూలు చేయమని అధికారులు వెల్లడించారు. అదే విధంగా తల్లిదండ్రులు లేకుండా అనాథులు గా బ్రతుకుతున్న చిన్నారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవనుంది. అమరావతిలో ఉంటున్న అనాధ పిల్లలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications