ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల పీజులు ఖరారు: నోటిఫికేషన్ జారీ, కాలేజీలకు హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ గురువారం నోటిపికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్ాయ సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఫీజులను అమలు చేయాలని ఆదేశించింది.
సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లోని పీజీ కోర్సులకు కూడా ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్, అఫిలియేషన్, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత విద్యా శాఖ హెచ్చరించింది.
కోర్సులు, వాటి పీజుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఎంఏ, ఎంకామ్ కోర్సులకు రూ. 15వేల నుంచి 30 వేల వరకు
మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూ. 27వేలు
కెమిస్ట్రీ రూ. 33వేలు
బయోటెక్నాలజీ రూ. 37,400
కంప్యూటర్ ఆప్లికేషన్స్ రూ. 24. 200
జెనెటిక్స్ రూ. 49వేలు