AP Lok Sabha Election Results 2024 LIVE : ఏపీ నుంచి పార్లమెంటుకు మెజార్టీ స్థానాల ఏ పార్టీవి..?
ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ప్రత్యక్ష ఫలితాలు 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తోంది. ఇందుకు కారణం ఈ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 81శాతం పోలింగ్ నమోదు కావడమే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల పల్స్ను పట్టుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పొచ్చు. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో స్పష్టంగా చెప్పడం కష్టతరంగా మారింది. వాస్తవ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని రెండు ప్రధాన పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టగా.. ఇంకొన్ని సంస్థలు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక జూన 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications