Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం...ఆగస్టు 1 నుంచి అమలు:ఉత్తర్వులు జారీ

అమరావతి:ఇప్పటివరకూ పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మథ్యాహ్న భోజన పథకం ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందుబాటులోకి రానుంది. ఆగస్టు 1 నుంచి వారికి ఈ మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌దాస్‌ బుధవారం ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. 331 జూనియర్‌ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆహార సరఫరా చేస్తారు.

Andhra Pradesh:Mid day meals for intermediate students...implementation from August 1

ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంటశాలలకు, ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+