AP Budget 2026: బడ్డెట్ స్పీచ్ లో పయ్యావుల అనూహ్యం-ఇదే తొలిసారి..!
ఏపీలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ (AP Budget 2026) ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో పలు పథకాలు, రంగాలకు నిధుల కేటాయింపులు చేస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. అదే సమయంలో పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో పలు అనూహ్య అంశాల్ని తెరపైకి తెచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉండటం ఇదే తొలిసారి అని ఆర్ధిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన పయ్యావుల కేశవ్.. అదే సమయంలో గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్దరణ చర్యలను కూడా ప్రస్తావించారు. అలాగే స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా బడ్జెట్లో పొందుపర్చినట్లు తెలిపారు.

గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియచేయడం కోసమే వివరాలను బడ్జెట్ లో ప్రస్తావించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించమని వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపామని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా 12.3 శాతంగా ఉన్న వడ్డీని 9 శాతానికి తగ్గించేలా ఆయా ఆర్థిక సంస్థలను ఒప్పించామన్నారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సంప్రదింపుల ఫలితంగా ఏడాదికి రూ.327 కోట్ల మేర ఆదా అయిందన్నారు. మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు ఫలమిస్తే ఏటా రూ.1658 కోట్లు ఆదా అవుతుందన్నారు.

అలాగే గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల్లో రూ.24,811 కోట్లు చెల్లింపులు జరిపామని ఆర్ధికమంతత్రి తెలిపారు. ఆర్థిక కార్యాకలాపాల పునరుద్దరణకు ఇరిగేషన్, రహదారుల పనుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రూ. 37030 కోట్లు వ్యయం చేశామన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీల బలోపేతం నిమిత్తం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ. 3797 కోట్ల మేర బదలాయించామన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 స్కీంల పునరుద్దరణకు రూ. 18,701 కోట్లు ఖర్చు పెట్టామని, ఫలితంగా కేంద్రం నుంచి నిధుల విడుదల మరింతగా పెరిగిందన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications