Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేషన్ కార్డు దారులకు భారీ గుడ్ న్యూస్ - ఇక నుంచి కొత్తగా..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ షాపుల నిర్వహణ.. సరుకుల పంపిణీలో కీలక మార్పులు చేసింది. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను అందించింది. అదే సమయంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకులను అందిస్తోంది. ఇదే సమయంలో రేషన్ సరుకుల్లోనూ కొత్తవి అందించాలని నిర్ణయించింది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తోంది. తాజాగా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.

రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ గోధుమపిండి రూ.40 నుంచి 80 దాకా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రేషన్ దుకాణాల్లో కేవలం రూ.20కే గోధుమ పిండిని అందించనుంది. ఈ నిర్ణయం జనవరి ఒకటి నుంచి రేషన్ షాపుల్లో అమలు చేయనుంది. మొదటగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనుంది.

AP Govt decided to provide Wheat Atta for Rs 20 in ration shops in selected areas

కాగా, జనవరిలో అందించే ఈ సరుకులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచే పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే 51లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఇందుకోసం నెల, వారాల చొప్పున టార్గెట్లు ఫిక్స్‌ చేసినట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు నవంబరు నెలలో 11లక్షల మెట్రిక్‌ టన్నులు, డిసెంబరులో 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జనవరిలో 8లక్షల మెట్రిక్‌ టన్నులు, పిబ్రవరిలో 3లక్షల మెట్రిక్‌ టన్నులు, మార్చిలో 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విదంగా క్యాలెండర్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041 రైతు సేవా కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు సిద్దమవుతున్నట్లు తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా 6కోట్ల గోతాలను సిద్దం చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+