అమరావతిలో మరో కీలక ఘట్టం..! శాశ్వత హైకోర్టుకు తొలి అడుగు..!
ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు కీలక నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే సీఆర్డీయే ఆఫీసును పూర్తి చేసి ప్రారంభించింది. దీంతో పాటు సచివాలయ టవర్స్, ఇతర నిర్మాణాలను కూడా ఏకకాలంలో చేపడుతోంది. వీటికి కొనసాగింపుగా ఇవాళ శాశ్వత హైకోర్టు నిర్మాణానికి పునాదిరాయి పడింది. మున్సిపల్ మంత్రి నారాయణ సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అమరావతి రాజధానిలో శాశ్వత హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని మంత్రి నారాయణ ఇవాళ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. బీ ప్లస్ జీ ప్లస్ 7 అంతస్తుల్లో ఐకానిక్ టవర్స్ గా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈరోజు హై కోర్టు పనులు ప్రారంభించామన్నారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హై కోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు. మొత్తం 45000 టన్నుల స్టీల్ ను భవనానికి వాడుతున్నట్లు ఆయన తెలిపారు. 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని ఆయన గుర్తుచేశారు.
-
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications