ఏపీ ఐసెట్ ఫలితాల విడుదల: టాప్-10 ర్యాంకర్లు వీరే..
అమరావతి: ఏపీ ఐసెట్-2019 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సంయుక్తంగా బుధవారం విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది. మొత్తం 52,736 మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో 48,445 మంది పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ విద్యాసంవత్సరంలో సుమారు అయిదువేల మంది విద్యార్థులు అధికంగా దరఖాస్తులను చేసుకున్నారు. ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.టాప్ టెన్ ర్యాంకర్లు..
గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ తొలిర్యాంకును సాధించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కావ్యాశ్రీ ద్వితీయ, విజయవాడకి చెందిన నరహరి శెట్టి శివసాయి పవన్ తృతీయ ర్యాంకును సాధించారు. యాగంటి మునిచంద్రారెడ్డి నాలుగో ర్యాంకును చేజిక్కించుకున్నారు. భానుప్రకాశ్-5, వెంకట నాగేంద్ర-6, పానుగంటి వెంకటలక్ష్మి కిరణ్మయి-7, కలతూరు భానుప్రకాశ్రెడ్డి-8వ ర్యాంకును తెచ్చుకున్నారు. ఆనెం అఖిల్- 9, అంబటి సురేంద్రరెడ్డి 10వ ర్యాంకును సాధించారు.
90కి
పైగా
ఉత్తీర్ణత
శాతం
ఐసెట్
ఫలితాల్లో
మొత్తం
90.27
శాతం
మంది
విద్యార్థులు
ఉత్తీర్ణత
సాధించారు.
26,002
మంది
బాలురు,
22,443
మంది
బాలికలు
ఉత్తీర్ణత
సాధించినట్లు
విజయ
రాజు
తెలిపారు.
ఈ
నెల
15
నుంచి
ర్యాంకు
కార్డులు
డౌన్లోడ్కు
అవకాశం
కల్పించనున్నారు.
జులై
మూడో
వారం
నుంచి
కౌన్సిలింగ్
నిర్వహించనున్నారు.
విద్యార్థుల
కోసం
వచ్చే
జులైలో
కౌన్సెలింగ్
నిర్వహిస్తామని
విజయ
రాజు
తెలిపారు.
ఈ
నెల
15వ
తేదీ
నుంచి
ర్యాంకు
కార్డులును
తమ
అధికారిక
వెబ్సై్
నుంచి
డౌన్లోడ్
చేసుకోవచ్చని
అన్నారు.