వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీ, సోనియాలపై సోమిరెడ్డి నిప్పులు: వారు ఇష్టపడ్డారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Somireddy Chandramohan Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తాత సొత్తు కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. మధ్య ప్రదేశ్‌లో డిగ్గీ తీసేసిన తహసీల్దారు లాంటివారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ మూడు పార్టీలు ఒక్కటే అన్నారు. ఎంపీలు వివేక్, మందా జగన్నాథం, విజయశాంతిలు పార్టీలు మారినప్పుడు ఆయా పార్టీలు ఎందుకు అనర్హత పిటిషన్ వేయలేదో చెప్పాలన్నారు. తెలుగు జాతిని చీల్చి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘోర పాపం చేస్తున్నారన్నారు.

ఎంపీలు జగన్నాథం, వివేక్‌లు తెరాసలో కీలకపాత్ర పోషిస్తుంటే సస్పెండ్ చేసే దమ్ము లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్రలో కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇష్టపడితే, తెలంగాణలో కాంగ్రెసు - తెరాసలు ఇష్టపడ్డాయని ఎద్దేవా చేశారు. రాయలసీమను విభజించాలన్న డిమాండ్ న్యాయసమ్మతం కాదన్నారు.

నిధులు, నీళ్ల పైన స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. సమన్వయ కమిటీ సమావేశాన్ని హైదరాబాదులో పెట్టుకునే దమ్ము లేదా అన్నారు. అన్ని కుట్రలు ఢిల్లీ నుండి చేస్తారా అని ధ్వజమెత్తారు. రాజ్యాంగవిరుద్ధంగా చేసే ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy on Friday said AP is not Digvijay Singh's property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X