డిగ్గీ, సోనియాలపై సోమిరెడ్డి నిప్పులు: వారు ఇష్టపడ్డారు
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ మూడు పార్టీలు ఒక్కటే అన్నారు. ఎంపీలు వివేక్, మందా జగన్నాథం, విజయశాంతిలు పార్టీలు మారినప్పుడు ఆయా పార్టీలు ఎందుకు అనర్హత పిటిషన్ వేయలేదో చెప్పాలన్నారు. తెలుగు జాతిని చీల్చి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘోర పాపం చేస్తున్నారన్నారు.
ఎంపీలు జగన్నాథం, వివేక్లు తెరాసలో కీలకపాత్ర పోషిస్తుంటే సస్పెండ్ చేసే దమ్ము లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్రలో కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇష్టపడితే, తెలంగాణలో కాంగ్రెసు - తెరాసలు ఇష్టపడ్డాయని ఎద్దేవా చేశారు. రాయలసీమను విభజించాలన్న డిమాండ్ న్యాయసమ్మతం కాదన్నారు.
నిధులు, నీళ్ల పైన స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. సమన్వయ కమిటీ సమావేశాన్ని హైదరాబాదులో పెట్టుకునే దమ్ము లేదా అన్నారు. అన్ని కుట్రలు ఢిల్లీ నుండి చేస్తారా అని ధ్వజమెత్తారు. రాజ్యాంగవిరుద్ధంగా చేసే ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.