చిరంజీవితో కాపులకు ఒరిగిందేమీ లేదు: బహిరంగ లేఖలో మండిపడ్డ రామానుజయ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చిరంజీవికి ఆయన బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవితో కాపులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి పదవిలో ఉండగా చిరంజీవి కాపులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి చిరంజీవి అడ్డుపడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుంటే, ప్రభుత్వంపై కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాపులకు అన్యాయం చేసే వ్యక్తులతో చిరంజీవి చేతులు కలపడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న ముద్రగడకు మద్దతుగా నిలుస్తున్నా చిరంజీవి కాపులకు అన్యాయం చేసే దిశగానే పయనిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వల్లే కాపులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications