రేపు రాష్ట్రపతితో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సమావేశం;ఉపరాష్ట్రపతికి చికిత్స
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు సోమవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని ఆయన ఈ సందర్భంగా వినతి చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీల్లో నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేస్తున్నారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుకు కాటరాక్ట్ చికిత్స అందించారు. చికిత్స అనంతరం వెంకయ్యనాయుడు ఇంటికి బయలుదేరి వెళ్లారు. వెంకయ్య నాయుడుకు కంటి చికిత్స సంతృప్తికరంగా జరిగిందని, అయితే ఈ చికిత్సకు సాధారణంగానే కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని, ఆ ప్రకారమే వెంకయ్య నాయుడు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications