ఏపీ పంచాయతీ రంగుల తొలగింపుపై హైకోర్టులో విచారణ, 3 నెలల సమయం కోరిన సర్కార్, నో..
పంచాయతీ భవనాలకు వేసిన రంగుల తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. రంగులు తొలగించేందుకు తమకు మరింత సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో గురువారం ప్రభుత్వం తరఫున వాదనలను హైకోర్టు ధర్మాసనం అలకించింది.

పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించే పిటిషన్ను గురువారం హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రంగులు తొలగించేందుకు తమకు సమయం కావాలని ప్రభుత్వం వాదనలు వినిపించింది. కనీసం మూడు నెలల సమయం కావాలని కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది.
కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. సోమవారం రోజున చెబతామని పేర్కొన్నారు. కానీ అతని వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. వీలైనంత త్వరగా పార్టీ రంగు తొలగించాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలతో రావాలని కోరింది. రంగులు వేసే సమయాన్ని ఖచ్చితత్వంతో తెలియజేయాలని స్పష్టంచేసింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications