జగన్ సర్కార్కు గుడ్ న్యూస్
ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు, దీంతో అంతర్జాతీయ వేదికలతోబాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు.
ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షలమంది పిల్లలు హాజరై తమ ప్రభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5907 స్కూళ్ళకు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16. 5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ స్కూళ్లలో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది. తాజాగా దీనిపై సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్పందించారు. గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనడం ఎంతో ముచ్చటగా ఉందన్నారు.
ఏప్రిల్ 12న 5,907 పాఠశాలల్లోని 16.5 లక్షల మందికి పైగా (6 నుంచి 9వ తరగతి వరకు) విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తారని ప్రకాశ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనుకూలీకరించిన ఆంగ్ల మూల్యాంకనాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రిన్స్టన్ ఆధారిత ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) జూన్ 23, 2023న ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సహకారం లక్షలాది మంది విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది అకడమిక్ ఎక్సలెన్స్ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications