కెసిఆర్ ఢిల్లీ టూర్: దూరం.. బాబుకు మోడీ మరో షాకిచ్చేనా?
ఢిల్లీ: ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే, ఏపీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు మాత్రం బీజేపీకి దూరం జరిగేందుకు ఏమాత్రం సుముఖంగా లేరు.
సరిగ్గా నిధులు ఇవ్వలేదని చెబుతూనే, ప్రత్యేక హోదా పైన కేంద్రం షాకిచ్చినా... రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీకే మొగ్గు చూపుతున్నారు. అయితే, బీజేపీ మాత్రం టీడీపీతో దోస్తీని కట్ చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం తాను ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తామని అంటున్నారు. ఒకటికి వందసార్లు ఢిల్లీకి తిరుగుతానని చెబుతున్నారు.
అయితే, ప్రత్యేక హోదాతో పాటు నిధుల విషయంలోను చంద్రబాబుకు కేంద్రం నుంచి షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల తెలంగాణ సీఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అంశాలను గుర్తు చేస్తున్నారు.

కేసిఆర్ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, నిధుల విషయంలో కేంద్రం నుంచి అంత సానుకూలం కనిపించలేదని వార్తలు వస్తున్నాయి. కేంద్రం తన పరిస్థితే బాగోలేదని కేసీఆర్కు చెప్పిందని ఓ వర్గం మీడియా వార్తలు రాసింది.
కేంద్రం నుంచి కెసిఆర్ పెద్ద ఎత్తున ప్యాకేజీని ఆశించారు. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదని, కేంద్రం పరిస్థితే బాగా లేనందున ప్యాకేజీకి అవకాశం లేదని అంటున్నారని చెబుతున్నారు.
కేసీఆర్కు కేంద్రం మొండిచేయి అని చెప్పకుండా.. ఆర్థిక కష్టాల్లో ఉన్నందున కేంద్రం ఏం చేయలేకపోతున్నామని చెప్పిందని అంటున్నారు. అంటే, తర్వాత చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు రాబట్టకపోయినా అపవాదు పడకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, కేసీఆర్తో భేటీ అనంతరం ప్రధాని కార్యాలయం... తెలంగాణ ప్రభుత్వం పథకాలను మెచ్చుకుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను మెచ్చుకున్నారు.
తన పార్టీ, మిత్రపక్షం కానీ కేసీఆర్ను చంద్రబాబు మెచ్చుకున్నారని, కానీ మిత్రపక్షమైన చంద్రబాబును మెచ్చుకున్న సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు.
అలాగే, ప్రత్యేక హోదా పైన, నిధుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు.. టిడిపిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని బీజేపీ అధిష్టానం అదుపు చేయడం లేదు. పైగా, ఇటీవల కేంద్రమంత్రులు చంద్రబాబుపై పరోక్ష కామెంట్లు చేశారు. వీటన్నింటిని చూస్తుంటే చంద్రబాబుకు దూరం జరిగేందుకే బీజేపీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఓ విధంగా, చంద్రబాబుకు దూరం జరిగేందుకే ప్రత్యేక హోదాను ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానం కూడా కొందరిలో కలుగుతుందంటున్నారు. కేసీఆర్ను ప్రధానమంత్రి మెచ్చుకోవడం తెలుగుదేశం పార్టీకి పుండుమీద కారం చల్లినట్లుగా ఉందని అంటున్నారు.
మరో విషయమేంటే, తెరాస కేంద్రంలో చేరనుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని ఇరు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కానీ పార్టీల తీరు చూస్తుంటే మాత్రం కేంద్రంలో చేరినా ఆశ్చర్యపోయే అవకాశం లేదన్నట్లుగా ఉందని అంటున్నారు. మోడీ.. బాబుకు దూరం అవుతూ, కెసిఆర్కు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. టిఆర్ఎస్ కేంద్రంలో చేరితో కవితకు మంత్రి పదవి వస్తుందనే పుకార్లున్నాయి.
-
ఫలించిన కవిత పోరాటం.. దిగొచ్చిన రేవంత్ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications