స్వలింగసంపర్కం: కోరిక తీర్చలేదని యువకుడి హత్య

న్యాయవాది కార్యాలయం నారాయణగూడలోని లింగంపల్లిలో గల అన్నపూర్ణ రెసిడెన్సీ భవనం మూడో అంతస్థులో ఉంది. స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డ నర్సింహారావు గత సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు కార్యాలయంలోనే ఉన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అబిడ్స్లోని తాజ్మహల్ హోటల్కు వెళ్లి భోజనం చేశాడు. తర్వాత అక్కడ రోడ్డుపై ఉన్న ఓ యువకుడ్ని (22) తీసుకుని కార్యాలయానికి వచ్చాడు.
ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో నర్సింహారావు ఆ యువకుడ్ని కార్యాలయం కిటికీ నుంచి బయటకు తోసివేశాడు. తీవ్రమైన గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నర్సింహారావును అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడ్ని విచారించిన పోలీసులు స్వలింగ సంపర్కం కోసం జరిగిన ప్రయత్నమే యువకుడి హత్యకు దారితీసిందని తెలిపారు. నిందితుడు మాయమాటలు చెప్పి యువకుడ్ని అబిడ్స్ నుంచి తాను పనిచేస్తున్న న్యాయవాది కార్యాలయానికి తీసుకొచ్చాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో యువకుడ్ని కిటికీలో నుంచి తోసివేశాడని తెలిపారు. న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని మంగళవారం రిమాండ్కు తరలించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఆధారాలు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
సచివాలయ ఉద్యోగిపై ఉద్యోగిని దాడి
తెలంగాణ ఆర్థిక శాఖలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎంవి రమణయ్యపై పంచాయతీరాజ్ ఉద్యోగిని సుబ్బులు దాడి చేసిందని మంగళవారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మంగళవారం సాయంత్రం రమణయ్య దగ్గరకొచ్చిన సుబ్బులు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమణయ్యపై దాడికి పాల్పడగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు. అనంతరం రమణయ్య సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications