ఏపీలో పొత్తులపై నిర్ణయానికి వచ్చేసిన బీజేపీ..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. పొత్తుల్లో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే తమ అభ్యర్దులను ప్రకటించాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆ రెండు పార్టీల అధినేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బీజేపీ ఇప్పుడు ఏపీ పైన ఫోకస్ చేసింది. అభ్యర్దుల ఖరారు పైన సూచనలు చేసింది. దీని ద్వారా పొత్తుల పైన బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
పొత్తుల లెక్కలు : ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు పైన త్వరలోనే తేలిపోనుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్లమెంట్ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల అంశం తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ నేత శివప్రకాశ్జీ ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. భేటీలో పొత్తు సహా పలు అంశాలపై చర్చించారు. పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్దుల అంశం పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు..సీట్ల అభ్యర్దులు..ఉమ్మడి సభ లపైన సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. పొత్తుల పైన పార్టీలో ఎలాంటి అభిప్రాయం ఉందనేది తెలుసుకున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

ఏపీ పై ఫోకస్ : మరో రెండు రోజులు విజయవాడ కేంద్రంగా శివప్రకాశ్జీ సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ, జనసేన నేతలు బీజేపీ తమతో కలిసి వస్తుందని చెబుతున్నారు. సీట్ల అంశం పైన చర్చ సాగుతోంది. బీజేపీ కోరిన విధంగా సీట్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతోందని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే ఎంపీ అభ్యర్దులను ఖరారు చేసేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. 25 ఎంపీ స్థానాల నుంచి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారి జాబితా..అసెంబ్లీకి పోటీ చేసే వారి జాబితా సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. పొత్తుతో వెళ్తే జరిగే ప్రయోజనం..ఒంటరిగా వెళ్లటం ద్వారా ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే అంశం పైన అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

ఇక తేల్చేస్తారా : గతంలోనే ఈ అంశం పైన నివేదికలు సిద్దం చేసారు. ఇప్పుడు మరోసారి పొత్తుల పైనే జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలతో మంతనాలు చేయటం ద్వారా అసలు పొత్తుల పైన ఏం జరుగుతందనే చర్చ మొదలైంది. పవన్ మాత్రం ఇప్పటికీ పొత్తు ఖాయమనే విధంగా వ్యాఖ్యలు చేసతున్నారు. పొత్తుల పైన ఎవరూ మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ స్పష్టం చేసింది. పొత్తుల అంశం కేంద్ర నాయకత్వమే తేల్చుతుందనేది ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఇప్పుడు బీజేపీలో వస్తున్న కదలికతో పొత్తు ఉంటుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. అయితే, ఈ మొత్తం సస్పెన్స్ కు ఒకటి , రెండు రోజుల్లోనే బీజేపీ అధినాయకత్వం తేల్చే అవకాశం కనిపిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications