చంద్రబాబుతో బోయపాటి భేటీ, పవిత్ర సంగమంపై ప్రజెంటేషన్! పదిరోజుల్లో తుది నిర్ణయం?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బుధవారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భేటీ అయ్యారు. పవిత్ర సంగమం వద్ద నిర్మాణాలకు సంబంధించిన నమూనాలపై సీఆర్డీఏ సమావేశంలో బోయపాటి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బుధవారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలివున్న మరో దేవాలయ రూపకల్పనకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సీఆర్డీఏ సమావేశంలో బోయపాటి శ్రీను ముఖ్యమంత్రికి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ ప్రజెంటేషన్లో విజయవాడ పవిత్ర సంగమం వద్ద వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాల నమూనాలని, దశావతారాల థీమ్తో రూపకల్పన చేసినట్టు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి అందిస్తున్నామని, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
బోయపాటి శ్రీను అందించిన ప్రాజెక్టు నమూనా గురించి ఆగమ శాస్త్ర నిపుణులు, టీటీడీ వేద పండితులను సంప్రదించి మరో పదిరోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications