Padmavibhushan Chiranjeevi: పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందల వెల్లువ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. కళారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. దీన్ని ఇవాళ ఆయన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముర్ము నుంచి అందుకున్నారు. దీంతో చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH | Delhi: President Droupadi Murmu confers Padma Vibhushan to Konidela Chiranjeevi in the field of Art. pic.twitter.com/dh1ehQJz8m
— ANI (@ANI) May 9, 2024
చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం పట్ల ద్రౌపదీ ముర్ము స్పందించారు. "తన సినిమాల ద్వారా, మానవతా సేవల ద్వారా ప్రజల జీవితాలను స్పృశించిన ప్రముఖ నటుడు. శ్రీ చిరంజీవి పార్లమెంటు సభ్యునిగా మరియు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అతను మార్గదర్శక ప్రయత్నాలను కూడా చేసాడు మరియు అనేక సామాజిక కారణాల కోసం విస్తృతంగా పనిచేశాడు." అని తెలిపారు.

President Droupadi Murmu presents Padma Vibhushan in the field of Art to Shri Konidela Chiranjeevi. He is a popular actor who has touched the lives of people through his films and humanitarian services. Shri Chiranjeevi has served as a Member of Parliament and Union Minister. He… pic.twitter.com/fAQThmfBG0
— President of India (@rashtrapatibhvn) May 9, 2024
చిరు పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ @KChiruTweets
గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి." అని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ @KChiruTweets గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. pic.twitter.com/PQZEA1QtXV
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2024
మెగాస్టార్ కు పద్మవిభూషణ్ లభించడం పట్ల టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. "మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తెలుగువారు గర్వించే సందర్భం. నాతో సహా కోట్లాది అభిమానులు ఆనందించే సమయం." అని తెలిపారు.
మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ @KChiruTweets గారు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తెలుగువారు గర్వించే సందర్భం. నాతో సహా కోట్లాది అభిమానులు ఆనందించే సమయం. pic.twitter.com/mEYEHpXNQA
— Lokesh Nara (@naralokesh) May 9, 2024
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications