అమరావతిలో వ్యాపార దిగ్గజాలు .! లోకేష్ తో భేటీ ఐన ప్రముఖ కంపేనీల యజమానులు..!!
అమరావతి/హైదరాబాద్ : అమరావతిలోని నివాసంలో క్రెడాయ్, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్,ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్,నవ్యాంధ్ర ఇండస్ట్రియల్ అసోసియేషన్,స్వర్ణాంద్రా ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2014 రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, సమస్యలను అధిగమించి అభివృద్ధి సాదించగలిగామని లోకేష్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించామని, దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ వివరించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానానికి ఎదిగామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

అసోసియేషన్ల వారిగా సమస్యలు,సూచనలు తెలుసుకొని వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా నని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మరింత మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం తరపున నిరంతర సహకారం అందిస్తామని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి వ్యాపార వేత్తల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి ఒక వినూత్న ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం అభివృద్ధి కి అనేక పాలసీలు తీసుకొచ్చామని, అనేక రాయితీలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి,రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్నయాని అసోసియేషన్ల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications