వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అనకొండ, బాబు మన్ను తిన్న పాము: బైరెడ్డి

|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar reddy
కర్నూలు: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మన్ను తిన్న పాములా ప్రవర్తిస్తుంటే.. జగన్ అన్నీ తిన్న అనకొండలా వ్యవహరిస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. తాము రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకమని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర విభజనను ఎవరూ అడ్డుకోలేరనేది అర్ధమైపోయిందని, రాయల తెలంగాణను ప్రతిపాదించే వారందరూ సీమ ద్రోహులేనని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రాయల తెలంగాణ అంటున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఓ విషపురుగు అని అన్నారు.

హైదరాబాద్‌లో గానాబజానా సుఖాల కోసమే కొందరు నేతలు రాయల తెలంగాణ అంటున్నారని బైరెడ్డి ఆరోపించారు. రాయల తెలంగాణ కోసం అసదుద్దీన్ కాళ్లు పట్టుకుని ఆస్తులు కాపాడుకునేందుకు కొందరు నేతలు యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ సాధన కోసం పార్టీలకతీతంగా రాయలసీమ ప్రాంత నేతలందరూ రంగంలోకి దిగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఏదో ఒక సమయంలో విభజన ఆగిపోతుంది: గంటా

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏదో ఒక సమయంలో ఆగిపోతుందని, అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏదైనా చెబితే అది జరగదని, ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని మార్చే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి ప్రశ్నలకు అధిష్టానం సమాధానం ఇచ్చిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తారని తెలిపారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పినా ఇంత వరకు అది జరగలేదన్నారు. అధిష్టానం దొడ్డిదారిలో తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

English summary

 Rayalasima Parirakshana Samithi President Byreddy Rajasekhar reddy on Friday fired at Telugudesam Party President Chandra babu naidu and YSR Congress Party President Ys Jaganmohan Reddy and MIM Leader Asaduddin Owaisi on state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X