ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం: కారు దగ్ధం
ఆదివారం రాత్రి కూడా ఓ కారు, మోటార్ బైక్ ఢీకొని దంపతులు మృత్యువాత పడ్డారు. రింగ్ రోడ్డు పైన వెళ్తున్న దంపతులు బైక్ పైన వెళ్తుండగా హుడా కాలనీ వద్ద వారిని కారు ఢీకొంది. దీంతో దంపతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పైనే వదిలేసి పారిపోయాడు.
పోలీసులు కథనం ప్రకారం... దంపతులు రాజేంద్ర నగర్ నుండి శంషాబాద్ వైపుకు బైక్ పైన వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారు హుడా కాలనీకి చేరుకున్న తర్వాత ఓ కారు ఢీకొట్టింది. దీంతో వారు కిందపడ్డారు. ఆ తర్వాత వారు మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ రోజు అదే ప్రాంతంలో కారు దగ్ధమైంది.
దంపతుల ఆత్మహత్య
కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లిదండ్రులు మృతి చెందగా, ఇద్దపు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.