ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గజమాలతో బాబు: కెసిఆర్‌పై మండిపాటు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కెసిఆర్ గడిచిన పదేళ్లలో ఏ ఒక్కరోజు కూడా తెలంగాణపై మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదన్న భయంతోనే కెసిఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేస్తున్నారని ఆయన విమర్శించారు.

బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, కడెం, నిర్మల్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్ర సంగించారు. టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీయని, కెసిఆర్ కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. తాము బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. యువత భవిష్యత్తు బాగుపడాలంటే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులకు సైకిల్ గుర్తుకే ఓటువేసి గెలిపించాలన్నారు.

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తే ఆదిలాబాద్‌ను బంగారు జిల్లాగా మారుస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే జిల్లాను తెలుగుదేశం ప్రభుత్వం దత్తత తీసుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. టిడిపి అధికారంలోకి రాగానే జిల్లాలో గిరిజన యూనివర్సిటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల వెన్నంటే ఉన్న రమేష్ రాథోడ్‌ను మళ్లీ గెలిపిస్తే కేంద్రంలో మం త్రి పదవిని ఇప్పిస్తామని హామీనిచ్చారు. సింగరేణికి సంబంధించిన రూ. 600 కోట్ల రుణ బకాయిలను మాఫీ చేశామన్నారు.

బాబు సభకు హాజరైన జనం

బాబు సభకు హాజరైన జనం

బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, కడెం, నిర్మల్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్ర సంగించారు.

విమర్శలు

విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బాబు రోడ్‌షో

బాబు రోడ్‌షో

పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కెసిఆర్ గడిచిన పదేళ్లలో ఏ ఒక్కరోజు కూడా తెలంగాణపై మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు.

భారీగా తరలిన జనం

భారీగా తరలిన జనం

త్వరలో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదన్న భయంతోనే కెసిఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

బాబు ప్రసంగం

బాబు ప్రసంగం

టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీయని, కెసిఆర్ కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.

బాబుకు గజమాల

బాబుకు గజమాల

యువత భవిష్యత్తు బాగుపడాలంటే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులకు సైకిల్ గుర్తుకే ఓటువేసి గెలిపించాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తే ఆదిలాబాద్‌ను బంగారు జిల్లాగా మారుస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

English summary
Telugudesam Party president Chandrababu Naidu on Wednesday fired at Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X