ఎన్నికలకు సీతాదేవి శీలానికి ముడిపెట్టి!: చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు
ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వివాదానికి తావిచ్చే వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితులుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త మాత్రం ఎందుకు వద్దంటుంది? అని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మరోసారి నోరు జారారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న ప్రధాని మోడీ ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం స్వాగతిస్తానని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎన్నికలకు సీతాదేవి శీలానికి ముడిపెడుతూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. గతంలోను ఇలా వివాదస్పద వ్యాఖ్యల్లో ఇరుక్కుని ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. మురికివాడలో ఉన్న స్కూళ్లలో చదివితే మురికి ఆలోచనలే వస్తాయంటూ పేదలను అగౌరవపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశారు.
తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షం చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన చంద్రబాబే స్వయంగా వివాదాలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు.
-
ఏపీకి కూల్ న్యూస్.. దట్టమైన పొగమంచు.. ఈ జిల్లాలలో వర్షాలు! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications