జగన్తో సహా కొత్తే: బాబు, కాల్ మనీతో చంద్రబాబుకు కొత్త చిక్కులు
హైదరాబాద్: ప్రతిపక్షంలో అధినేత వైయస్ జగన్ సహా చాలామంది కొత్తగా ఎన్నికైన వాళ్లని అందుకే వారికి సభా సంప్రదాయాలు తెలియవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్ మనీ పైన రేపు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.
శాసన సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అంబేడ్కర్ గురించి సభలో చర్చకు రానివ్వక పోవడం దురదృష్టకరమన్నారు. వాళ్ల పార్టీలో అందరూ కొత్తవాళ్లేనని అందుకే ఏం తెలియవన్నారు.
17 అంశాలతో ప్రతిపక్షాల ఆరోపణలకు వివరణ
ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం 'ఆరోపణలు - వాస్తవాలు' పేరుతో ఓ పుస్తకాన్ని తెచ్చింది. అందులో ఇసుక మాఫియా, ప్రత్యేక హోదా, బాక్సైట్ తవ్వకాలు తదితర అంశాలపై వివరణ ఇచ్చింది.

ఏఎస్సై సూర్యప్రకాశ్ కేసు కాకినాడ డిఎస్పీకి అప్పగింత
కాల్ మనీ కేసులో ఏఎస్సై సూర్యప్రకాశ్ పైన ఆరోపణలు వచ్చాయి. సూర్యప్రకాశ్ పైన పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్సై కేసును కాకినాడ డిఎస్పీకి అఫ్పగించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ ఘటన పైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
కాకినాడలో 46 కేసులు
కాకినాడలో కాల్ మనీ కేసులు 46 నమోదయ్యాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమోటోగా 28 కేసులు పెట్టారు. ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు అందినట్లుగా పోలీసులు చెప్పారు. కాగా, కాల్ మనీ బాధితులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు.
కొత్త చిక్కులు.. సాధారణ రుణాలు కలపొద్దని విజ్ఞప్తి
'కాల్ మనీ' వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణ రుణాలు తీసుకున్న వారు కూడా బాధితులుగా పోలీసు స్టేషన్లను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ రుణాలను 'కాల్ మనీ'లో కలపవద్దని పలువురు విజ్ఞప్తి చేశారు.
పలువురు నేతలు కాల్ మనీ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. సాధారణ రుణాలను కాల్ మనీలోకి కలిపే అవకాశాలున్నాయని, కాబట్టి పోలీసులకు తగు సూచనలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications