కాంగ్రెస్కు షాక్: పచ్చ కండువా కప్పుకునేందుకు మరో ఎమ్మెల్సీ సిద్ధం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ భత్యాల చెంగల్రాయుడు పార్టీ మారనున్నారంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: కడప జిల్లా కాంగ్రెస్కు మరో గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ భత్యాల చెంగల్రాయుడు పార్టీ మారనున్నారంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది.
ఆయన పార్టీ మారనున్నారంటూ ప్రచారం జరుగుతున్నా ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం ఇప్పటి వరకు స్పస్టత లేదు. అయితే తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది.
కడప జిల్లా ఇంఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో మంగళవారం విశాఖపట్టణంలో కడప జిల్లా ముఖ్యనేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులు సమావేశమైన భత్యాల చేరికపై చర్చించినట్టు సమాచారం.
ఈమేరకు భత్యాల చేరికకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే భత్యాల చెంగల్రాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.