మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం
విడమలూరు : పైప్లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవిగా మారడంతో ఆ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
12 అడుగుల లోతు ..
నెల్లూరు జిల్లా విడమలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో పైప్ లైన్ కోసం 12 అడుగుల కందకం తవ్వారు. అయితే పైప్ లైన్ వేయకపోవడం .. అటుగా చిన్నారులు వెళతారనే జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతో అనుకున్నట్టుగానే మూడేళ్ల సుష్మిత, నాలుగేళ్ల గోపీరాజు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో కందకానికి సమాంతరంగా తవ్వి మట్టిని వెలికితీశారు.

గంటన్నర నరకయాతన ...
దాదాపు గంటన్నర పాటు చిన్నారులు కందకంలో ఉండిపోయారు. ఈ లోపు జేసీబీతో తవ్వించి .. వారిని బయటకు తీశారు. అయితే కందకంలో పడి చిన్నారి సుస్మిత తీవ్రంగా గాయపడింది. బయటకు తీసిన కాసేపటికే చనిపోయి .. కన్నవారికి కడుపుశోకాన్ని మిగిల్చింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ సురక్షితంగా వచ్చారనే సంతోషం కాసేపట్లో ఆవిరైంది. సుష్మిత మృతితో ఆమె పేరెంట్స్, బంధువులు బోరున విలపించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications