దాచేపల్లిలో ఉద్రిక్తత: హోంమంత్రి కాన్వాయ్ అడ్డగింత, ‘సుబ్బయ్య’ అప్పగింతకు డిమాండ్
గుంటూరు: దాచేపల్లిలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటుగా వచ్చిన హోంమంత్రి చిన్నరాజప్ప కాన్వాయ్ను బాధితురాలి బంధువులు, దాచేపల్లి వాసులు అడ్డుకున్నారు.
దాచేపల్లి రేప్ ఇష్యూ: చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు సుబ్బయ్య
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆత్మహత్యకు ఒడిగట్టిన సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడివారిని చెదరగొట్టి హోంమంత్రి కాన్వాయ్ను అక్కడ్నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా కాన్వాయ్ను అడ్డుకున్న పలువురిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు.
కాగా, గురజాల ప్రభుత్వాసుపత్రిలో సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతని మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులెవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో గురజాల పంచాయతీ సిబ్బందికి సుబ్బయ్య మృతదేహాన్ని అప్పగించనున్నారు.