నేను ఒకరి విషయంలో జోక్యం చేసుకోను: పవన్పై చిరు
హైదరాబాద్: తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై కేంద్రమంత్రి చిరంజీవి గురువారం స్పందించారు. పవన్ ప్రచారం పవన్ దే, తన ప్రచారం తనదేనని చెప్పారు. తాను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోనని చిరంజీవి వ్యాఖ్యానించారు.
తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనన్నారు. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ పైన నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయన మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. మోడీ వ్యాఖ్యలను బిజెపిలోని మహిళా కార్యకర్తలు కూడా స్వాగతించరన్నారు.

తెలంగాణ అభివృద్ధికి బిజెపి కృషి: స్వామి
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి గురువారం అన్నారు. హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఉన్నత చదువులు లేని సోనియా గాంధీ ఉన్నత పదవులు ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిపై వస్తున్న విమర్శలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబర్డ్ వాద్రా ప్రభుత్వం భూములను తక్కువ ధరకు కాజేశారని ఆరోపించారు.
-
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'












Click it and Unblock the Notifications