నేను ఒకరి విషయంలో జోక్యం చేసుకోను: పవన్పై చిరు
హైదరాబాద్: తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై కేంద్రమంత్రి చిరంజీవి గురువారం స్పందించారు. పవన్ ప్రచారం పవన్ దే, తన ప్రచారం తనదేనని చెప్పారు. తాను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోనని చిరంజీవి వ్యాఖ్యానించారు.
తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనన్నారు. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ పైన నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయన మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. మోడీ వ్యాఖ్యలను బిజెపిలోని మహిళా కార్యకర్తలు కూడా స్వాగతించరన్నారు.

తెలంగాణ అభివృద్ధికి బిజెపి కృషి: స్వామి
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి గురువారం అన్నారు. హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఉన్నత చదువులు లేని సోనియా గాంధీ ఉన్నత పదవులు ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిపై వస్తున్న విమర్శలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబర్డ్ వాద్రా ప్రభుత్వం భూములను తక్కువ ధరకు కాజేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications