కలిసొస్తే ముఖానికి రంగు వేసుకుంటా: చిరంజీవి
హైదరాబాద్: అన్నీ కుదిరితే తాను తన 150వ సినిమా చేస్తానని కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి రావడంతో ముఖానికి రంగు వేసుకుని తన 150వ సినిమాను పూర్తి చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.
సమయం వచ్చినప్పుడు తాను నటిస్తానని, అన్నీ సరిగా కుదిరితే తాను సినిమా చేస్తానని ఆయన గురువారంనాడు అన్నారు. సోదరుడు నాగబాబు కుమారుడు వరణ్ తేజ సినిమా ముహూర్తానికి చిరంజీవి భార్య సురేఖతో కలిసి వచ్చారు.

వరణ్ తేజ సోదరుడు ధరమ్ తేజ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చాడు. ఆయన సినిమా రేయ్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమా షూటింగ్కు కొంత సమయం వెచ్చించాడు.
కన్యాకుమారిలో షూటింగ్లో పాల్గొంటున్న తన కుమారుడు రామ్ చరణ్ తేజతో తాను మూడు రోజుల పాటు ఉన్నానని, షూటింగ్ కారణంగా రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడని చిరంజీవి చెప్పారు.
వరణ్ తేజను చిరంజీవి ఆరున్నర అడుగుల అందగాడిగా అభివర్ణించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాననే విషయం తనకు తెలుసునని, తాను సినిమా చేయాలని అనుకుంటున్నానని, అయితే తన చేతుల్లో ఏదీ లేకుండా పోయిందని, అది దేవుడి చేతుల్లో ఉందని చిరంజీవి అన్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications