సొంత కొడుకు పై నమ్మకం లేదు, అరువుకు దత్తపుత్రుడు: జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి టీడీపీఅధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సొంత బలం,సొంత కొడుకు పైన నమ్మకం లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ నగరిలో పర్యటించారు.విద్యా దీవెన నిధులను విడుదల చేశారు.నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11300 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 84 వేల మంది తల్లుల ఖాతాల్లో 680 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 28 ఏళ్ల క్రితమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని జగన్ ప్రశ్నించారు.

సొంత కొడుకు పైనే నమ్మకం నమ్మకం లేదని అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు మోసాలతోనే నిలిచిందన్నారు. రెచ్చగొట్టి శవరాజకీయాలు చేయాలనేదే చంద్రబాబు ఉద్దేశమని సీఎం వ్యాఖ్యానించారు పోలీసులపై పుంగనూరులో రాళ్లు కర్రలు బీరు సీసాలతో దాడి చేయించారని ఆరోపించారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రోజున ఆయన పేరుతో నాణెం విడుదల చేస్తుంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లను ఆయనే సృష్టించి, తమ పార్టీ మీద ఫిర్యాదు చేయటానికి సీఈసీ కలుస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. తాను ఎక్కించిన దొంగ ఓట్లపై తానే ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధాలు కుట్రలు చేయటమే చంద్రబాబు రాజకీయమని జగన్ ఆరోపించారు.

ఎన్నికల ముందు మేనిఫెస్టో స్వర్గం చూపిస్తానంటారని తర్వాత నరకం చూపించటం చంద్రబాబుకు అలవాటని ముఖ్యమంత్రి విమర్శించారు. అటువంటి వ్యక్తి చెప్పే మాటలు, చెప్పిన ప్రతి మాట అమలు చేసే తమ పార్టీ మధ్య తేడాను గమనించాలని జగన్ సూచించారు.తన నాలుగేళ్ల పాలనలో రెండు లక్షల 33 వేల కోట్లు ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
నాడు చంద్రబాబు పాలనకంటే ప్రస్తుతం అప్పుల గ్రోత్ రేట్ తక్కువగా ఉందని కానీ నాడు ఇదే రకమైన మంచి ఎందుకు జరగలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని, అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓకే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తనకు తోడుగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. మంత్రి రోజా అభ్యర్థన మేరకు పవర్లూమ్స్ మీద విద్యుత్ చార్జీలను మినహాయిస్తున్నట్లు నగరి వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications