ప్రాంతీయ విబేధాల్లేవ్, ముల్లు గుచ్చితే నోటితో తీస్తా: 'సెటిలర్స్'లేదన్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని కూకట్పల్లిలో పలువురు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయవాదానికి తావులేదన్నారు. మీ తాతలు, తండ్రుల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని సీమాంధ్రవాసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇక సెటిలర్స్ అనే పదానికి తావు లేదని చెప్పారు. మెదక్ జిల్లాలో పుట్టిన తాను హైదరాబాదీనే అని చెప్పారు.

హైదరాబాదులో ఉన్న వాళ్లంతా తెలంగాణవారేనని చెప్పారు. హైదరాబాదులో స్థిరపడ్డ వారితో త్వరలో తాను సమావేశం అవుతానని చెప్పారు. ఇకపై ప్రాంతీయ విబేధాలు ఉండవని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రాప్రాంత వాసుల పట్ల ఇక ముందు వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్నారు. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రావాసుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదన్నారు. ఉద్యమ సమయంలో బావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే కాని వారి పట్ల ఎలాంటి వివక్ష చూపించమన్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications