ఆస్తుల వెల్లడిపై అక్బరుద్దీన్ ఓవైసీపై ఈసికి ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట సిట్టింగ్ శాసనసభ్యుడు, మజ్లీస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీపై ఎన్నికల కమిషన్ (ఈసి)కి ఫిర్యాదు అందింది. ఎన్నికల అఫిడవిట్లో కావాలనే అక్బరుద్దీన్ తన అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ఓ వ్యక్తి ఆరోపించాడు.
దరీచా రంగే అలీ షాలో అక్బరుద్దీన్ ఓవైసీ 577 చదరపు గజాల ఇంటిని కొనుగోలు చేశాడని, దాని మున్సిపల్ నెంబర్ 18-7-316 అని, విద్యా పండిట్ రామకృష్ణ నుంచి ఓవైసీ దాన్ని 8 లక్షల 77 వేల రూపాయలకు 2005 ఏప్రిల్ 19వ తేదీన కొన్నాడని మౌలిం మోహిసిన్ బిన్ అల కసారీ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్కు ఆ వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీపై ఫిర్యాదు చేశాడు. కావాలనే ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఓవైసీ చెప్పలేదని ఆయన ఆరోపించాడు,.
2009 ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆ ఇంటి విషయాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ దాచిపెట్టాడని, ఈ ఎన్నికల అఫిడవిట్లో కూడా దాన్ని ప్రస్తావించలేదని ఆయన అన్నాడు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications