హక్కులకు భంగం: పవన్ కళ్యాణ్పై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్పై అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 27న తిరుపతిలో నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పలు కులాలు, మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ కులాల హక్కులకు భంగం కలిగే రీతిలో మాట్లాడారని వివరించారు.

తనకు కులా లు, మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని సభలో పవన్ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో ఉదయ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు.
అంతేగాక, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయని ఏపీ సీఎం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
-
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications