రూ.35లక్షల వసూలు: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై సీపీకి బాధితుడి ఫిర్యాదు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరారావు మరోసారి భూవివాదంలో చిక్కుకున్నారు. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమా కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలతిసిందే.
Recommended Video

తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితుడు తెలిపాడు.

కానీ, ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు ఎమ్మెల్యే బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. మాగంటి బాబుతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని బోండా ఉమ చెప్పారని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సుబ్రహ్మణ్యం సీటీ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు.
ఇది ఇలావుంటే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమా కొట్టిపారేశారు. మాగంటి బాబుతో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. తనపై కావాలనే ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని అన్నారు. పోలీసులు దీనిపై లోతుగా విచారణ జరపాలని కోరారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications