విశాఖ రాజేష్ కుటుంబం ఆత్మహత్య: కామాంధులు వేధించారు: సౌమ్య సంచలనం
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్టణంలోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో దేవిరెడ్డి రాజేష్రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ప్రకాశం జిల్లా కనిగిరి చెంది రాజేష్ రెడ్డి కొంత కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఎలక్ట్రిషీయన్గా రాజేష్రెడ్డి పనిచేస్తున్నాడు.
రాజేష్రెడ్డికి భార్య సౌమ్య, పిల్లలు విష్ణు, జాహ్నవి ఉన్నారు. ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తున్న రాజేష్రెడ్డి గురువారం ఉదయం పనికి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం రాత్రి వారు నలుగురు చనిపోయారు.

బంధువులకు ఫోన్ చేసి రాజేష్ కుటుంబం ఆత్మహత్య
గురువారం ఉదయం పూట యధావిధిగా రాజేష్ విధులకు వెళ్ళాడు. సాయంత్రం విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఏమైందో ఏమో కానీ నలుగురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు చెన్నైలో ఉన్న తమ బంధువులకు పోన్ చేసి సమాచారమిచ్చారు. చెన్నైలోని బంధువులు విశాఖ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే బంధువుల సమాచారం మేరకు విశాఖ పోలీసులు రాజేష్ రెడ్డి ఇంటికి చేరుకొనేసరికి వారు నలుగురు చనిపోయారు.

కామాంధులు వేధించారు
చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని సౌమ్య సూసైడ్ లేఖ రాసింది. నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.కామాంధుల వేధింపులు భరించలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కామాంధుల ఆగడాలను భరించే శక్తి తనకు లేదన్నారు.వారి ఆగడాలను తట్టుకునే శక్తి ఇక లేదని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.

పిల్లలను అందుకే చంపాం
ఎన్నో విషయాలు చెప్పాలని తనకు ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ విషయాలను చెప్పలేకపోతున్నట్టు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా చంపాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ లో రాసింది.

కామాంధుల నుండి జాగ్రత్త
తమ బంధువుల పిల్లలైన ప్రియ, పవిత్రలకు ఆ లేఖలో సౌమ్య జాగ్రత్తలు చెప్పింది. చాలా మంది కామాంధులు ఉన్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోట్ ను విశ్లేషిస్తున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications